Advertisement

ఉండి వైసీపీలో రాజీనామా కలకలం: పార్టీకి వీడ్కోలు చెప్పనున్న పీవీఎల్ నరసింహరాజు

మన పత్రిక: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో PVL Narasimha Raju వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ పార్టీ బాధ్యతల నుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, ఈ విషయంలో తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.

ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్‌ను వైసీపీ అధిష్ఠానం నియమించింది. అదే సమయంలో పీవీఎల్ నరసింహరాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది. నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న తమ నాయకుడిని ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంపై నరసింహరాజు వర్గీయులు, స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన నాయకుడిని పక్కనబెట్టడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్న పీవీఎల్, వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement