Advertisement

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధించిన పలాస కోర్టు

మన పత్రిక: మాజీ మంత్రి Seediri Appalaraju కు పలాస కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. తన కుమారుడు ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలు చెరిపివేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్టు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసులు సీదిరి అప్పలరాజును పలాస కోర్టులో ప్రవేశపెట్టారు.

ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు జైలుకు తరలించారు.

Advertisement
Advertisement