Advertisement

నీట్ వివాదంపై చర్చలకు సిద్దమన్న కేంద్ర ప్రభుత్వం

మన పత్రిక: దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ (NEET Paper Leak) వ్యవహారంలో ఆందోళనలు ఉద్ధృతమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సమస్య పరిష్కారం కోసం చర్చలకు రావాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులను, కాక్రోచ్ జనతాపార్టీ (CJP) నేతలను ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించింది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

ఆందోళనకారులకు అనుకూలమైన సమయంలో ఎప్పుడైనా నేరుగా వచ్చి చర్చలు జరపవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. నిరసనకారుల డిమాండ్లను పరిశీలించిన కేంద్రం ఇప్పటికే నాలుగు ప్రతిపాదనలను పంపిందని, వాటిపై సమగ్రంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో లేదా ఆయన కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ చర్చల్లో జేపీ నడ్డాతో పాటు తాను కూడా పాల్గొంటానని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ముందుగా చర్చలు ప్రారంభిస్తే క్రమంగా సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement