మన పత్రిక, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కిషన్ రావు పేట గ్రామ పంచాయతీలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నెలకొన్న వివాదం ఆరు నెలలుగా కొనసాగుతోంది. కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సర్పంచ్, పాలకవర్గం, మరియు పాత కార్యదర్శి కృష్ణారెడ్డి మధ్య ఈ సమస్య జటిలమైంది. గతంలో అధికారుల పాలనలో ఉన్నప్పుడు రూ. 8 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేశానని, ఆ మొత్తాన్ని చెల్లించాలని కృష్ణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే, సరైన బిల్లులు సమర్పిస్తేనే డబ్బులు చెల్లిస్తామని పాలకవర్గం స్పష్టం చేస్తోంది.
మాయమైన రికార్డులు
పాత కార్యదర్శి కృష్ణారెడ్డి బదిలీపై వెళ్తూ గ్రామ పంచాయతీకి సంబంధించిన కీలక రికార్డులను తనతో పాటు తీసుకెళ్లారు. దీనివల్ల ప్రస్తుతం కొత్త కార్యదర్శికి మరియు పాలకవర్గానికి పనులు నిర్వహించడం కష్టంగా మారింది. రికార్డులు లేకపోవడంతో గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమస్యపై మండల పరిషత్ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదని, వారు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కుమ్మరి సునీత అధికారులను కోరారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- తల్లికి వందనం పథకం: అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ
- ఢిల్లీలో సీజేపీ ఆందోళనలో ప్రధాని మోడీపై యువకుడి అనుచిత వ్యాఖ్యలు
- గందరగోళం సృష్టించేందుకు గూండాలను పంపారు: అభిజిత్ దీప్కే
- కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ జాతీయ ప్రతినిధి హెచ్చరిక
- షూటింగ్ మొదలవ్వకముందే భారీ రికార్డు సృష్టించిన ధనుష్ కొత్త సినిమా
