Advertisement

16 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించే యోచనలో కేంద్రం

మన పత్రిక: సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లలపై పడుతున్న దుష్ప్రభావాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏళ్ళ లోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా ఆంక్షలు విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఈ అంశంపై భారత్ లోని పార్లమెంటరీ స్థాయి సంఘాలతో సహా వివిధ వర్గాలు చర్చిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా విధానాల అధ్యయనం

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, 16 ఏళ్ళ లోపు చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇది ప్రపంచానికే స్ఫూర్తిదాయకమైన నిర్ణయమని ఆస్ట్రేలియా ప్రధాని అంథోని అల్బనీస్‌తో ఆయన చెప్పారు. సోషల్ మీడియా నియంత్రణలో ఆస్ట్రేలియా చట్టాల నుండి భారత్ నేర్చుకుంటుందని ప్రధాని తెలిపారు. ఆస్ట్రేలియా తరహాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, టిక్‌టాక్ వంటి వేదికలపై వయసు నిర్ధారణ చర్యలు చేపట్టడం, నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలకు జరిమానా విధించడం వంటి అంశాలను భారత్ పరిశీలిస్తోంది.

Advertisement
Advertisement