Advertisement

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్

మన పత్రిక, ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. ఇటీవల పవన్ కల్యాణ్ తన కుడి భుజానికి శస్త్రచికిత్స (Surgery) చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ ఆరోగ్యంపై ఆరా తీసిన ఫడ్నవీస్, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ శస్త్రచికిత్స నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు వైద్యులు కనీసం మూడు వారాల పాటు ఫిజియోథెరపీ (Physiotherapy) అవసరమని సూచించారు. కాగా, ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పవన్‌ను కలిసి పరామర్శించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయన తిరిగి తన సాధారణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement