Advertisement

బీఎస్ఎన్ఎల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: రూ. 259కే 700GB డేటా, ఉచిత OTT

మన పత్రిక, న్యూఢిల్లీ: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంత వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రకటించింది. నెలకు రూ. 259 ధరతో అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్‌లో 25 Mbps వేగంతో 700GB డేటాను వినియోగించుకోవచ్చు. భారత్‌నెట్ (BharatNet) ప్రాజెక్టు మద్దతుతో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశమని సంస్థ వెల్లడించింది.

ఈ ప్లాన్ కింద వినియోగదారులకు దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితంగా లభిస్తాయి. అదనంగా, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉచిత OTT సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి ఉచిత ఇన్‌స్టాలేషన్‌తో పాటు మోడెమ్‌ను కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. నిర్ణీత డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 2 Mbpsకు తగ్గుతుంది.

Advertisement
Advertisement