Advertisement

హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్: విడా VX2 ప్లస్ లాంచ్

మన పత్రిక, ఢిల్లీ: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లోకి విడా (VIDA) బ్రాండ్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ సరికొత్త VIDA VX2 ప్లస్ మోడల్ 4.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. కంపెనీ గణాంకాల ప్రకారం, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 187 కిలోమీటర్ల గరిష్ట రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్‌లో రెండు రిమూవబుల్ బ్యాటరీలు అమర్చారు.

డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ద్వారా కేవలం 65 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,43,990గా నిర్ణయించారు. ఈ స్కూటర్ ఈ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (Asia Book of Records) లో కూడా ఈ మోడల్ చోటు దక్కించుకుంది.

Advertisement
Advertisement