Advertisement

విశాఖపట్నంలో స్వల్ప భూప్రకంపనలు

మన పత్రిక, విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం సుమారు 5:08 గంటల సమయంలో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) నివేదించింది.

కాకినాడ తీరానికి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు ధృవీకరించారు. సునామీ ముప్పు లేదని స్పష్టం చేస్తూ, ప్రజలు ఆందోళన చెందవద్దని మరియు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

Advertisement
Advertisement