Advertisement

షాబాద్ హత్యల ఘటనపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

మన పత్రిక, షాబాద్: రంగారెడ్డి జిల్లాలో జరిగిన దారుణ హత్యల ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనలను ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.

ఘటన జరిగిన తర్వాత కేవలం స్థానిక ఎస్సై (SI) ని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement