Advertisement

Valmiki jayanthi | కామారెడ్డిలో ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ

కామారెడ్డిలో వాల్మీకి జయంతిని ( Valmiki jayanthi ) ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి (Additional SP Narasimha Reddy) వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆయన మాట్లాడుతూ, వాల్మీకి బోధనలు సత్యం, ధర్మం, సమానత్వానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం ఆచరణాత్మకమన్నారు. “ఆయన ఆశయాలను కొనసాగించినప్పుడే వాల్మీకికి మనం ఇచ్చే నిజమైన నివాళి” అని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో లింగనాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement