Advertisement

లడ్డూ ధర పెరుగుతుందా? టీటీడీ ఛైర్మన్ స్పష్టం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధర పెరుగుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. “ఇది తప్పుడు ప్రచారం. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు” అని ఆయన స్పష్టం చేశారు.

“లడ్డూ ప్రసాదాల ధరను పెంచే ఆలోచననే మాకు లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

Advertisement

భక్తులకు ఒక ఊరట – లడ్డూ ధర మారదు!

Advertisement