మన పత్రిక: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 5) ఉదయం 6:30 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,930 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,350గా నమోదైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,51,080, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,500 వద్ద ట్రేడవుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే, హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్కతా, పుణే నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ.1,50,930గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,350గా ఉంది. వడోదరలో 24 క్యారెట్ల ధర రూ.1,50,980, 22 క్యారెట్ల ధర రూ.1,38,400గా ఉంది.
ఇక చెన్నైలో బంగారం ధరలు దేశంలోనే అధికంగా ఉండి 24 క్యారెట్లకు రూ.1,52,180, 22 క్యారెట్లకు రూ.1,38,510గా నమోదయ్యాయి. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,50,940 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,39,500గా ఉంది.మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.2,55,000గా ఉండగా, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో రూ.2,50,000గా ఉంది.మొత్తంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కదలాడుతున్నాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ పరిణామాలపై ఆధారపడి ధరల్లో మార్పులు ఉండే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
