మన పత్రిక, వెబ్డెస్క్: పసిడి, వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. ఈరోజు (డిసెంబర్ 12) బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 1,910 పెరగడంతో ధర రూ. 1,32,660కి చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ. 1,21,600 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండిపై రూ. 3,000 పెరిగి ప్రస్తుతం రూ. 2,04,000 మార్కును తాకింది. ఇక ప్లాటినం (10 గ్రాములు) ధర రూ. 910 పెరిగి రూ. 49,200గా నమోదైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 90.36 వద్ద కొనసాగుతోంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
