Advertisement

తల్లికి వందనం డబ్బులు రావడం లేదా? ఇలా చేస్తే డబ్బులు జమ

Thalliki Vandanam News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం నుంచి డబ్బులు రాక, చాలా మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కారణం? కరెంట్ బిల్లుల సమస్య, ఒకరి పేరు మీద రెండు మీటర్లు ఉండటం!

రాజమహేంద్రవరం రూరల్‌లో ఎం.నాగదేవి తన పేరు మీద రెండు మీటర్లు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యారు. ఒకటి తన ఇంటికి, మరొకటి శ్రీరామ్‌నగర్‌లోని వాంబేగృహాల్లో! నాలుగు రోజులు కార్యాలయం చుట్టూ తిరిగి, తప్పులు సరిచేయించుకోవాల్సి వచ్చింది.

Advertisement

ఇలాంటి సమస్యలతో జిల్లాలో వందలాది మంది విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్ మ్యాపింగ్ లోపాలు, ఇల్లు మారిన వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. తప్పులు సరిచేస్తే డబ్బులు జమ అవుతాయి!

Advertisement