ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం కింద ఇంకా నగదు పొందని అర్హులకు రూ.325 కోట్లు విడుదల చేయనుంది. ఇందులో భాగంగా కొత్తగా ప్రవేశించిన 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లులకు కూడా ₹13,000 జమ చేయనున్నారు.
Advertisement
ఈ వారం నుంచి అర్హుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే తొలి విడతలో 67.27 లక్షల మందికి డబ్బులు అందాయి. రెండో విడతలో 5.5 లక్షల 1వ తరగతి, 4.7 లక్షల ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం కలిగించనున్నారు.
Advertisement
అర్హత ఉందో లేదో చెక్ చేయండి:
అధికారిక వెబ్సైట్ https://gsws-nbm.ap.gov.in/ లో ‘Application Status Check’ ఎంచుకొని, ఆధార్ నెంబర్, OTP నమోదు చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.
పథకం సారాంశం:
Advertisement
- ప్రతి విద్యార్థికి ₹15,000 (₹13,000 తల్లి ఖాతాకు, ₹2,000 స్కూల్ డెవలప్మెంట్కు)
- ఇప్పటికే ₹10,091 కోట్లు ఖర్చు
- విద్యార్థులను చదువుకు ప్రోత్సహించడం లక్ష్యం
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

