మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) షాక్ ఇచ్చింది. పండుగ రద్దీ కోసం ఏర్పాటు చేసిన 6,431 ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీలను సాధారణం కంటే 1.5 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు జనవరి 9, 10, 12, 13, 18, 19 తేదీల్లో అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
అయితే, రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత ఛార్జీలే కొనసాగుతాయి. మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం (పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో) యథాతథంగా వర్తిస్తుందని ఆర్టీసీ తెలిపింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్ సహా ప్రధాన పాయింట్ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
