మన పత్రిక, హైదరాబాద్: వచ్చే నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( TELANGANA TET 2025 ) నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి జీవోలో మార్పులు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇన్సర్వీస్ టీచర్లకు, ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అనే అంశం కూడా ప్రకటనలో పేర్కొనే అవకాశం ఉంది.
ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధనను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దాదాపు పదేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే పరీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి ఏటా రెండు సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు జరిగాయి. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు చర్యలు మొదలుపెట్టారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, 2011 తర్వాత టీచర్ ఉద్యోగం చేయాలంటే టెట్ క్వాలిఫై చేయాలనే నిబంధన ఉంది. కానీ ఇప్పుడు అందరి టీచర్లకూ వర్తించేలా జీవోలో సవరణలు చేయాలని అధికారులు సూచించారు. ఈ సవరణ తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అనే అంశంపై విద్యాశాఖ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. కానీ, ఇది టెట్ నోటిఫికేషన్ ప్రకటనతో సంబంధం లేకుండా స్వతంత్రంగా కొనసాగుతుంది. సుమారు 45 వేల మంది ఇన్సర్వీస్ టీచర్లు రెండేళ్లలో టెట్ క్వాలిఫై చేయాల్సి ఉంది. ప్రమోషన్ల కోసం పోటీ పడే వారిని కలుపుకుంటే 60 వేల మంది వరకూ ఉండొచ్చు. వారంతా ఈసారి పరీక్ష రాసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
