మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణలో (Telangana) యాసంగి సీజన్ రైతు భరోసా (TG Rythu Bharosa) పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పంట సాగు చేసిన రైతులకే ఈ పెట్టుబడి సాయం అందించాలని భావిస్తోంది. ఇందుకోసం శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించిన తర్వాతే నిధులు జమ చేయనున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించి, శాటిలైట్ చిత్రాల ద్వారా పంట విస్తీర్ణాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం.
Advertisement
అయితే, ఈ కొత్త విధానం కారణంగా యాసంగి పెట్టుబడి సాయం రైతులకు అందడంలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వానాకాలం నష్టాలతో సతమతమవుతున్న అన్నదాతలు, యాసంగి సాగు కోసం ప్రభుత్వ సాయంపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
