మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణలోని ( TELANGANA RAINS ) పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం కారణంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ( HYDERABAD RAINS ) ఈ హెచ్చరిక జారీ చేసింది.
పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 30-34 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
ప్రభావిత జిల్లాల్లో కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి ఉన్నాయి.
ప్రజలు ఇంటి వద్దే ఉండి అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావడం బెటర్. పిడుగు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద, గుడారాల వద్ద నిలవకూడదు.
పరిస్థితి మరింత దిగువకు వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించాలి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

