Advertisement

అమెరికాలో విషాదం… అగ్ని ప్రమాదంలో జనగామ విద్యార్థిని మృతి.

మన పత్రిక, వెబ్​డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్ (Birmingham) ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) సంభవించిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం, గుంటూరుపల్లి గ్రామానికి చెందిన ఉడుమల సహజారెడ్డి (24)గా గుర్తించారు.

నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికా వెళ్లారు. ప్రమాద సమయంలో మంటల్లో చిక్కుకుని సహజారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. చేతికి అందివచ్చిన కుమార్తె ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement