మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణలో యాసంగి సీజన్కు సంబంధించి ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ. 12,000 చొప్పున అందిస్తుండగా, ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించిన రూ. 6,000 జమ అయ్యాయి.
ఇటీవల తుఫాను, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు, యాసంగి సాగు పెట్టుబడి కోసం ఇప్పుడు ప్రభుత్వ సాయం వైపు చూస్తున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, ఎన్నికలకు ముందే ఈ నిధులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఈ నెల 25న జరగనున్న కేబినెట్ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
