మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణలో యాసంగి సీజన్కు సంబంధించి ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ. 12,000 చొప్పున అందిస్తుండగా, ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించిన రూ. 6,000 జమ అయ్యాయి.
ఇటీవల తుఫాను, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు, యాసంగి సాగు పెట్టుబడి కోసం ఇప్పుడు ప్రభుత్వ సాయం వైపు చూస్తున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, ఎన్నికలకు ముందే ఈ నిధులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఈ నెల 25న జరగనున్న కేబినెట్ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
