Advertisement

తెలంగాణలో కొత్త వాహనాలపై ‘సెస్’ మోత.. బైక్, కార్లపై రేట్లు ఇవే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారిపై అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో ఇకపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ (Road Safety Cess) పేరుతో కొత్త పన్ను వసూలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ కొత్త విధానం ప్రకారం.. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, కార్లకు రూ.5 వేలు, లారీల వంటి భారీ వాహనాలకు రూ.10 వేల చొప్పున సెస్ వసూలు చేయనున్నారు. అయితే, సామాన్యులకు ఊరటనిస్తూ ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement
Advertisement