Advertisement
Telangana school news today rain

Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు

మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు (అక్టోబర్ 30, 2025) సెలవు ప్రకటించింది.

Advertisement

ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల విద్యా సంస్థలన్నిటికీ ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, ములుగు, కరీంనగర్ జిల్లాలకు సెలవు ప్రకటించారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement