Advertisement

TG News: రూ.5 వేల కోట్ల అమ్మకాలు, సర్కార్‌కు కాసుల వర్షం

మన పత్రిక, వెబ్​డెస్క్: కొత్త సంవత్సరం (2026) వేడుకల సందర్భంగా తెలంగాణలో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్ 31న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. బార్లు, పబ్బులు, క్లబ్బులతో పాటు వైన్ షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. ప్రభుత్వం కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇవ్వడంతో విక్రయాలు జోరుగా సాగాయి.

న్యూ ఇయర్ జోష్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.5 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు ఏకంగా వెయ్యి కోట్లు పెరగడం విశేషం. మొత్తానికి తెలంగాణ ఖజానాకు న్యూ ఇయర్ కాసుల వర్షం కురిపించింది.

Advertisement
Advertisement