Advertisement

మహిళా సంఘాలకు గుడ్ న్యూస్: ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్.. 70% సబ్సిడీతో గేదెల పంపిణీ

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో మహిళా సాధికారత, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు( Indira Dairy Project )’ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఒక్కో సభ్యురాలికి రూ.2 లక్షల విలువైన రెండు పాడి గేదెలు లేదా ఆవులను పంపిణీ చేయనున్నారు.

భారీ సబ్సిడీ: ఈ పథకం కింద యూనిట్ ధర రూ.2 లక్షలు కాగా, ఇందులో ప్రభుత్వం ఏకంగా 70 శాతం (రూ.1.40 లక్షలు) సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 30 శాతం (రూ.60 వేలు) బ్యాంకుల ద్వారా రుణంగా అందిస్తారు.

Advertisement

పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. త్వరలోనే సీఎం నియోజకవర్గం కొడంగల్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.

ఫీచర్స్:

  • ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా, మండలాన్ని 3 జోన్లుగా విభజిస్తారు.
  • రవాణా కోసం ట్రాలీ ఆటోలు, పశువుల షెడ్లకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.
  • పశువైద్యులు ప్రతి నెలా తనిఖీ చేసి హెల్త్ కార్డులు జారీ చేస్తారు.
Advertisement