మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణలో మహిళా సాధికారత, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు( Indira Dairy Project )’ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఒక్కో సభ్యురాలికి రూ.2 లక్షల విలువైన రెండు పాడి గేదెలు లేదా ఆవులను పంపిణీ చేయనున్నారు.
భారీ సబ్సిడీ: ఈ పథకం కింద యూనిట్ ధర రూ.2 లక్షలు కాగా, ఇందులో ప్రభుత్వం ఏకంగా 70 శాతం (రూ.1.40 లక్షలు) సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 30 శాతం (రూ.60 వేలు) బ్యాంకుల ద్వారా రుణంగా అందిస్తారు.
పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. త్వరలోనే సీఎం నియోజకవర్గం కొడంగల్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.
ఫీచర్స్:
- ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్గా, మండలాన్ని 3 జోన్లుగా విభజిస్తారు.
- రవాణా కోసం ట్రాలీ ఆటోలు, పశువుల షెడ్లకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.
- పశువైద్యులు ప్రతి నెలా తనిఖీ చేసి హెల్త్ కార్డులు జారీ చేస్తారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
