Advertisement

జీవోలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాల్సిందే.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో (G.O.), నోటిఫికేషన్లు, నిబంధనలు మరియు సర్క్యులర్లను తక్షణమే ఆయా శాఖల అధికారిక వెబ్‌సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు.

Advertisement

అదృశ్యమైన 15 వేల జీవోలు: విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది సంచలన విషయాలను కోర్టు దృష్టికి తెచ్చారు.

  • కాలం: 2023 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు.
  • జారీ అయినవి: 19,064 జీవోలు.
  • అందుబాటులో ఉన్నవి: కేవలం 3,290 మాత్రమే.
  • మిగిలినవి: సుమారు 15,774 జీవోలు వెబ్‌సైట్లలో కనిపించడం లేదని న్యాయవాది వాదించారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి, 2022లో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రజల సమాచార హక్కుకు భంగం కలగకుండా వెంటనే అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశిస్తూ విచారణ ముగించారు.

Advertisement