ప్రభుత్వ పాఠశాలల్లో 2,837 కంప్యూటర్ ఉద్యోగాలు — రూ.15 వేల వేతనంతో టీచర్ నియామకాలు త్వరలో
తెలంగాణలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లున్న ప్రభుత్వ పాఠశాలలు 2,837గా గుర్తించబడ్డాయి. ఈ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను సద్వినియోగం చేసుకోవడానికి, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ప్రభుత్వం టీచర్ల నియామకానికి సన్నద్ధమవుతోంది. కొత్తగా నియమించబడే కంప్యూటర్ టీచర్లకు నెలకు రూ.15,000 గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ వేతనం సంవత్సరం లో 10 నెలలపాటు సమగ్ర శిక్ష నిధుల ద్వారా అందించబడుతుంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4,200 కంప్యూటర్లు సమకూర్చినా, ఆ ప్రాజెక్ట్ కాలపరిమితి పూర్తయ్యాక ల్యాబ్లు నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో, విద్యాశాఖ తాజాగా చేపట్టిన డిజిటల్ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం కొత్త నియామకాలను చేపట్టనుంది.
బెంగళూరుకు చెందిన “ఏక్ స్టెప్ ఫౌండేషన్” సహకారంతో 1,354 పాఠశాలల్లో అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఇప్పటికే అమలులో ఉంది. అదేవిధంగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఖాన్ అకాడమీ ద్వారా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు గణితం, సైన్స్ పాఠాలను ఆన్లైన్లో అందిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్లను సమర్థవంతంగా అమలు చేయడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న బోధకులు అవసరమని విద్యాశాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
