మన పత్రిక, వెబ్డెస్క్: హైదరాబాద్ మహానగర రూపురేఖలు మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మకమైన ‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు’ (Musi River Rejuvenation Project) పనులను వేగవంతం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. మార్చి 31లోపు అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో సీఎం వెల్లడించిన కీలక అంశాలు:
Advertisement
- నిధులు & అనుమతులు: ఈ ప్రాజెక్టు కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) రూ.4,000 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించిందని, కేంద్రం నుంచి కూడా అనుమతులు వచ్చాయని సీఎం తెలిపారు.
- నీటి తరలింపు: గోదావరి జలాలను తరలించి మూసీకి జీవం పోయనున్నారు. మొత్తం 20 టీఎంసీల గోదావరి జలాల్లో.. 15 టీఎంసీలు తాగునీటికి, 5 టీఎంసీలు మూసీలో నిరంతర ప్రవాహానికి వినియోగించనున్నారు.
- గాంధీ సరోవర్: బాపూఘాట్ వద్ద మూసా-ఈసా నదుల సంగమ ప్రాంతాన్ని ‘V’ ఆకారంలో ‘గాంధీ సరోవర్’గా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన మహాత్ముడి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు.
- ఎలివేటెడ్ కారిడార్: గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే ప్రణాళిక ఉన్నట్లు సీఎం వెల్లడించారు.
- సర్వమత సామరస్యం: మంచిరేవుల శివాలయ అభివృద్ధి, అలాగే మూసీ తీరంలో గురుద్వారా, మసీదు, చర్చి నిర్మాణాలు చేపట్టి మత సామరస్యాన్ని చాటుతామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
