మన పత్రిక, వెబ్డెస్క్: పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ మాజీ సర్పంచులు చేపట్టిన ఆందోళనతో తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మారినా విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.531 కోట్ల మేర బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వారు తెలిపారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. శాంతిభద్రతల దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
