మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈజేహెచ్ఎస్ (EJHS) వెల్నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. వెల్నెస్ సెంటర్లలో కేవలం ప్రాథమిక వైద్యమే కాకుండా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తేవాలన్నారు. ఇందులో భాగంగా జనరల్ సర్జరీ, కార్డియాలజీ (గుండె), నెఫ్రాలజీ (మూత్రపిండాలు), పీడియాట్రిక్స్ (పిల్లలు), న్యూరాలజీ, డెర్మటాలజీ వంటి విభాగాలను ప్రారంభించాలని సూచించారు.
ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
