మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు (Telangana bandh november 3) నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తక్షణమే రూ. 900 కోట్లు విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) డిమాండ్ చేసింది.
బకాయిల కారణంగా సిబ్బందికి జీతాలు, బిల్లులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ బంద్కు ఫ్యాకల్టీ అసోసియేషన్లు, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.
నిధులు దశలవారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా, యాజమాన్యాలు నమ్మడం లేదు. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే బంద్ను నిరవధికంగా కొనసాగిస్తామని ‘ఫాథీ’ హెచ్చరించింది. ఈ బంద్ కారణంగా రేపటి నుంచి తరగతులు, పరీక్షలు నిలిచిపోయే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
