మన పత్రిక, వెబ్డెస్క్: సూర్యాపేట జిల్లా ( Suryapet District ) అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు ఓ గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో పది గొర్రెలు మృతి చెందగా, మరో ఆరు తీవ్రంగా గాయపడ్డాయి.
గ్రామానికి చెందిన పగిడి వీరయ్య అనే రైతు రాత్రి సమయంలో తన ఇంటి పరిసరాల్లో ఉంచిన మందపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన గొర్రెలు చావుబతుకుల మధ్య ఉన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తనకు సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. గ్రామాల్లో కుక్కల బెడదను నివారించాలని అధికారులను కోరారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
