మన పత్రిక వెబ్డెస్క్, పుణె: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పుణెలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. పుణె నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నికైన కల్మాడి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగానూ సేవలందించారు.
భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగా క్రీడా రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, దాదాపు 15 ఏళ్ల విచారణ అనంతరం ఇటీవలే కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన పార్థివ దేహానికి ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు పుణెలోని వైకుంఠ్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
