Advertisement

సోంపేటలో ఆర్టీసీ బస్సు ఢీకొని 78 ఏళ్ల వృద్ధురాలి మృతి

మన పత్రిక, సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం పట్టణంలోని పెద్ద కోమటి వీధి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళను పలాసపురం పంచాయతీలోని పలాసపురం గ్రామానికి చెందిన బడియ పున్నాలు (78)గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఈ ఆర్టీసీ బస్సు బారువ ప్రాంతం నుంచి సోంపేట వైపు వస్తున్నట్లు నిర్ధారించారు. రోడ్డుపై ఉన్న ఆమెను బస్సు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Advertisement
Advertisement