Advertisement

సిరిసిల్ల టీచర్స్ క్రికెట్ టోర్నీ.. విజేతగా కోనరావుపేట జట్టు

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: మండల విద్యాధికారి మంకు రాజయ్య స్మారకార్థం నిర్వహించిన ‘టీచర్స్ ప్రీమీయర్ లీగ్’ (TPL) జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో జిల్లాలోని ఆరు జట్లు తలపడగా, ఫైనల్ లో సిరిసిల్ల జట్టుపై గెలిచిన కోనరావుపేట టీమ్ విజేతగా నిలిచింది. సిరిసిల్ల జట్టు రన్నరప్ గా నిలిచింది.

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే విజేతలకు కప్ ను అందించి అభినందించారు. ఉపాధ్యాయులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్ సేఫ్టీ పోస్టర్ ను ఆవిష్కరించి, అందరితో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement
Advertisement