శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్!
మన పత్రిక, వెబ్డెస్క్: హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టామని, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో వాటిని పేల్చేస్తామంటూ ఆగంతకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. బాంబు పేలకుండా ఉండాలంటే వెంటనే మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Advertisement
ఈ మెయిల్తో అప్రమత్తమైన ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది, పోలీసులు విమానాశ్రయంలోని అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక విచారణలో ఈ బెదిరింపు మెయిల్ న్యూయార్క్కు చెందిన ‘జాస్పర్ పకార్ట్’ అనే వ్యక్తి నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
