Samantha : ఐక్యరాజ్యసమితి తెలుసు కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు మరే ఇతర దేశంతో సమస్య ఉన్నా, ప్రపంచమంతా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలన్నా, ప్రపంచ ఖ్యాతి కోసం, ప్రపంచ మనుగడ కోసం ఏవైనా కార్యక్రమాలు ఉన్నా.. వాటన్నింటికీ ఇది వేదికలా పని చేస్తుంది.
ఇలాంటి సంస్థతో కలిసి టాలీవుడ్ హీరోయిన్ సమంత పనిచేయనుంది. దానికి కారణం ఏంటంటే.. ప్రస్తుతం ఆన్ లైన్ లో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి అందరికీ తెలిసిందే. ఆ వేధింపులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితితో కలిసి సమంత పని చేయనుంది.
యూఎన్ విమెన్ ఇండియా ద్వారా నిర్వహిస్తున్న నో ఎక్స్క్యూజ్ క్యాంపెయిన్ కు సమంత బ్రాండ్ అంబాసిడర్. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. దానికి సంబంధించి ఓ వీడియోను సమంత షేర్ చేసింది. మహిళలపై ఆన్ లైన్ లో నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్, ఫేక్ న్యూస్ లాంటివి రావడం వల్ల వాళ్లు చాలా ఇబ్బందులు పడతారు. ఆ బాధితురాళ్ల లిస్టులో తాను కూడా ఉన్నానని సమంత వెల్లడించింది. అందుకే ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని తనకు మద్దతు ఇవ్వాలని సమంత కోరింది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
