శబరిమలలో ఉద్రిక్తత: తెలుగు భక్తులపై దాడి.. గాజు సీసాతో తల పగలగొట్టిన వ్యాపారి!
మన పత్రిక, వెబ్డెస్క్: Sabarimala | శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. వాటర్ బాటిల్ ధర ఎక్కువైందని ప్రశ్నించినందుకు ఓ షాపు యజమాని ఆగ్రహంతో హైదరాబాద్కు చెందిన భక్తుడిపై గాజు సీసాతో దాడి చేయడంతో తల పగిలింది.
అంతేకాక, సదరు భక్తుడి మెడలోని మాలను కూడా వ్యాపారి తెంపేసినట్లు తెలుస్తోంది. దీనిపై తెలుగు భక్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టగా, స్థానికులు మరియు పోలీసులు వ్యాపారికే మద్దతుగా నిలిచారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ తెలుగు భక్తుల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాటు, ఇలాంటి వివక్షాపూరిత దాడులు జరుగుతుండటంపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
