Advertisement

అస్వస్థతలోనూ బాధ్యత చాటిన ఆర్టీసీ డ్రైవర్, 45 మంది ప్రయాణికుల ప్రాణాలు రక్షణ

మన పత్రిక, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఒక ఆర్టీసీ డ్రైవర్ తన ప్రాణాపాయ స్థితిలోనూ బాధ్యతను మరువకుండా వ్యవహరించి 45 మంది ప్రయాణికులను కాపాడారు. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ త్రిమోది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ పరిస్థితిలోనూ ఏమాత్రం తడబడకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు సురక్షితంగా ఆపివేశారు.

ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ త్రిమోదికి అస్వస్థత కలగడంతో, ప్రయాణికులు వెంటనే స్పందించి ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

Advertisement
Advertisement