Advertisement

267 కిలోల బంగారంతో వినాయకుడు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ముంబైలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రముఖ మాతుంగా గౌడ సారస్వత బ్రాహ్మణ (GSB) గణపతి దేశంలోనే అత్యంత ధనిక వినాయకుడిగా పేరుపొందాడు. ఈ ఏడాది, ఈ విగ్రహాన్ని 267 కిలోల బంగారు ఆభరణాలు, 350 కిలోల వెండి సింహాసనంతో అలంకరించారు. 70 ఏళ్లుగా ఈ విగ్రహాన్ని GSB ట్రస్ట్ ప్రతిష్ఠిస్తోంది. ఈ గణపతికి రూ.444 కోట్ల భారీ బీమా చేయించారు. ఈ బీమాలో విగ్రహం, బంగారం, వెండి ఆభరణాలు, మరియు మండపంలో జరిగే కార్యక్రమాల భద్రత కవర్ అవుతాయి.

మాతుంగా గణపతి ప్రత్యేకత ఏమిటంటే, ఏటా భక్తుల నుంచి బంగారం, వెండి రూపంలో విరాళాలు పెరుగుతూనే ఉండటంతో ఈ గణపతి అత్యంత ధనికుడిగా నిలిచారు. వేలాది మంది భక్తులు ప్రతిరోజూ గణపతిని దర్శించుకుని, నిత్యాన్నదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచనున్నాయి.

Advertisement
Advertisement