Advertisement

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మన పత్రిక, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. గత 20 రోజుల వ్యవధిలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని రీజనల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి గడ్కరీతో చర్చలు జరిపారు. ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అవసరమైన అంశాలపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కూడా కలవనున్నారు.

Advertisement
Advertisement