మన పత్రిక వెబ్డెస్క్, రాజన్న సిరిసిల్ల: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, దాడుల సెగ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరింది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్. రాజేశ్వరరావుకు గాయాలయ్యాయి.
గత ఏడాదిగా అబుదాబి ఎయిర్పోర్ట్లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు.. ఈ దాడుల్లో తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. వీడియో కాల్ ద్వారా తమతో మాట్లాడినప్పటికీ, గాయాలను మాత్రం చూపించలేదని ఆయన తండ్రి ప్రభాకర్ రావు కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడిని ఎలాగైనా సురక్షితంగా స్వగ్రామానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.
సురక్షితంగా చేరిన యాత్రికులు: మరోవైపు, గల్ఫ్ లోని యుద్ధ వాతావరణం నేపథ్యంలో సౌదీ అరేబియా (జెద్దా) నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు సురక్షితంగా ఉన్నామని తెలిపారు. విమానాల రద్దు కారణంగా ప్రయాణం కాస్త ఆలస్యమైనప్పటికీ, ట్రావెల్ ఏజెన్సీలు తమకు అన్ని వసతులు కల్పించాయని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని మదీనా యాత్రికుడు మహ్మద్ అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
