మన పత్రిక, వెబ్డెస్క్
వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వి. కవిత ఇంటిని 2004లో ప్రభుత్వం సేకరించింది. ఆమెకు నిర్వాసితుల జాబితాలో చేర్చకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఆమెను జాబితాలో చేర్చాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను అమలు చేయకుండా పోవడంతో కవిత కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
అదే సమయంలో ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులపై అప్పీలు దాఖలు చేసింది. అయినప్పటికీ పెండింగ్లో ఉన్న ఉత్తర్వులకు విరుద్ధంగా కలెక్టర్, ఆర్డీవోలు 2024 అక్టోబర్లో తహసీల్దార్కు లేఖ రాశారు. “కోర్టును తప్పుదోవ పట్టించింది” అని పేర్కొని కవితపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తీర్పు వెలువరించారు. “కలెక్టర్ తీరు సరికాదు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం ఆయనకు లేదు” అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్ను తీవ్రంగా మందలించాలని హైకోర్టు ఆదేశించింది.
అడ్వొకేట్ జనరల్ హాజరై కేసు ఉపసంహరణకు సమ్మతించారు. కవితను నిర్వాసితుల జాబితాలో చేర్చి అన్ని ప్రయోజనాలు అందించాలని కోర్టు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
