మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 28, 2024న అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. డీఈవో రాజు ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. స్కూల్స్ మరియు కాలేజీలతో పాటు ఇతర విద్యా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది.
Rain holiday august 28 telangana today
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
