మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు, ప్రజలకు కీలక సూచనలు చేశారు.
Rain alert in Telangana
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన 31 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలను వెంటనే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాగులు, వంకల మీద ఉన్న కల్వర్టుల మీద ప్రయాణాలను నిలిపివేయాలని ఆదేశించారు. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు రాకుండా పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
