మన పత్రిక, వెబ్డెస్క్: మొంథా తుఫాన్ వర్షాలు, ఎగువ ప్రాంత వరదతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. గురువారం బ్యారేజీలోకి 4.20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి ప్రవాహం 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది.
పులిచింతల ప్రాజెక్ట్ నుంచి 4.90 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, కీసర, వైరా వంటి ఉపనదుల నుంచి మరో 2 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరుతోంది. నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బ్యారేజీ వద్ద పరిస్థితిని సమీక్షించారు. బ్యారేజీ దిగువనున్న లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి, సహాయక చర్యలకు సిద్ధమయ్యారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Gold Price Today: ఈరోజు బంగారం ధరలు May 5
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
Advertisement
