మన పత్రిక, వెబ్డెస్క్: మొంథా తుఫాన్ వర్షాలు, ఎగువ ప్రాంత వరదతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. గురువారం బ్యారేజీలోకి 4.20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రానికి ప్రవాహం 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది.
Advertisement
పులిచింతల ప్రాజెక్ట్ నుంచి 4.90 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, కీసర, వైరా వంటి ఉపనదుల నుంచి మరో 2 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానదికి చేరుతోంది. నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బ్యారేజీ వద్ద పరిస్థితిని సమీక్షించారు. బ్యారేజీ దిగువనున్న లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి, సహాయక చర్యలకు సిద్ధమయ్యారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

