Advertisement

రూ.3 లక్షల లోన్, 5% వడ్డీ.. అర్హతలు ఇవే

సాంప్రదాయ వృత్తులపై ఆధారపడిన కళాకారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన’ ద్వారా భారీ ఊరటనిస్తోంది. పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్న మేస్త్రీలు, టైలర్లు, వడ్రంగులు, స్వర్ణకారులు వంటి చేతివృత్తుల వారికి ఈ పథకం కింద రూ.3 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం లభిస్తుంది. వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షించి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.

ఈ రుణాన్ని రెండు విడతల్లో అందిస్తారు. మొదటి విడతలో రూ.1 లక్ష, అది చెల్లించిన తర్వాత రెండో విడతలో రూ.2 లక్షలు ఇస్తారు. లబ్ధిదారులు కేవలం 5 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు కాగా, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. గత ఐదేళ్లలో ఇతర ప్రభుత్వ రుణ పథకాలు పొంది ఉండకూడదు.

Advertisement
Advertisement