ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Samman Nidhi Yojana) లో భాగంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన 27 లక్షల రైతులకు 21వ విడత ముందస్తుగా విడుదల చేయబడింది. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాణ్ సెప్టెంబర్ 26న ఈ మూడు రాష్ట్రాల రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 2,000 చొప్పున జమ చేశారు.
సాధారణంగా ఈ 21వ విడత ( PM Kisan 21st Installment 2025 ) అక్టోబర్ చివరి వారంలో విడుదల చేయాల్సి ఉండగా, ఈసారి దీపావళికి ముందే ముందస్తుగా జారీ చేయడం జరిగింది. ఇటీవల వర్షాలు, వరదలు, భూసరివి వంటి ప్రకృతి వైపరీత్యాలతో ఈ రాష్ట్రాల రైతుల పంటలు, ఫార్ములు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి ఈ విడత మూడు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ఇంకా విడుదల కాలేదు. కాబట్టి, మీ ఖాతాలో ఇంకా డబ్బు జమ కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ లలోని 27 లక్షల మంది రైతులకు (వీరిలో 2.7 లక్షల మంది మహిళా రైతులు ఉన్నారు) మొత్తం ₹540 కోట్లకు పైగా నిధులు జమ చేయబడ్డాయి.
ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రారంభించింది. రైతులకు ఆర్థిక సహాయం అందించడమే దీని ప్రధాన లక్ష్యం. పథకం కింద మూడు విడతల్లో సంవత్సరానికి ₹6,000 నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి. గతంలో, ప్రభుత్వం 20వ విడతను ఆగస్టు 2న విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
